శంషాబాద్ రూరల్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 823 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. విమానంలో దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, బంగారం బయటపడింది. బంగారాన్ని సీజ్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.