Huzurabad | ‘కేసీఆర్ సారు కన్నతండ్రిలెక్క ఎన్నో మంచి పనులు చేస్తుండు. ఎక్కడో కోళ్లు అమ్ముకునే ఈటలను ఆదుకోని, పార్టీ టికెట్లు ఇచ్చి, మంత్రినిజేస్తే.. ఇప్పుడు ఆయనకే వెన్నుపోటు పోడిసిండు ఈటల. ఈటల రాజీనామా చేసినంకనే పనులు బాగా జరుగుతున్నయ్. మా ఊళ్లు బాగుపడుతున్నయ్, మా బిడ్డలు బాగుపడుతున్నరు. కొత్త రోడ్లు వస్తున్నయ్.. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పనికూడా చేయలేదు’ అంటూ హుజూరాబాద్ ప్రజలు తమ మనోగతాన్ని మీడియా ముందు ఉంచుతున్నారు. ఈటల రాజేందర్ చేసిన పనులేం లేవని.. ఇంత అభివృద్ధికి కారణమైన టీఆర్ఎస్నే గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు.