హుజూరాబాద్ రూరల్/ జమ్మికుంట/ ఇల్లందకుంట, సెప్టెంబర్ 5: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. ఆదివారం జమ్మికుంటలో మంత్రులు తన్నీరు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో 2 వేల మంది దళిత యువకులు టీఆర్ఎస్లో చేరారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్లో జమ్మికుంట మండలం పెద్దంపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 50 మంది కారెక్కారు. ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన వంద మంది గౌడ కులస్థులు హుజూరాబాద్లో పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఇల్లందకుంట మండలం బోగంపాడు, చిన్నకోమటిపల్లి, పాతర్లపల్లికి చెందిన మాజీ సర్పంచ్లు, నాయకులు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సుడా చైర్మన్ రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.