హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 13: హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్లో ఈ నెల 16న నిర్వహించే సీఎం సభకు ఊరూరూ కదలాలని ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ మండలంలోని సింగాపురం గ్రామంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ ఇన్చార్జిలు, ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం సభను సక్సెస్ చేసేందుకు మండలం నుంచి 20వేల మందిని తరలించాలని పేర్కొన్నారు.
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుడు, పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారుడిపై ఈటల వ్యాఖ్యలు అవివేకానికి నిదర్శనమన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోషన్రావు, జడ్పీటీసీ పడిదం బకారెడ్డి, ఎంపీపీ రాణి సురేందర్రెడ్డి, నాయకులు సంగెం ఐలయ్య, ఎడవెల్లి కొండల్రెడ్డి, కిషన్రెడ్డి, కేతిరి రాజా ప్రతాపరెడ్డి, కన్నవేని శ్రీనివాస్, దాసరి రమణారెడ్డి, మొలుగూరి ప్రభాకర్ తదితరులున్నారు.