నిజామాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించడమే కాదు మూగ జీవాలు సైతం ఇబ్బంది పడుతున్నాయి. జిల్లాలోని కోటగిరి మండలం కొడిచర్ల శివారులోని మంజీరా నదిలో వందలాది గొర్రెలు, వాటి కాపర్లు చిక్కుకున్నారు. నిజాం సాగర్ నుంచి వరద నీటిని వదలడంతో అందులోనే చిక్కుకుని సహాయం కోసం అర్థించారు.
ఒడ్డుకు చేరేందుకు మార్గం లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మూగజీవాలను గొర్రెల కాపరులకు పోలీసులు రక్షించారు.