నిజామాబాద్: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 86,270 క్యూసెక్కుల వరద వస్తుండగా, 74,952 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1087.60 అడుగుల వద్ద నీరు ఉన్నది. శ్రీరాంసాగర్ గరిష్ట నీటినిల్వ 90.30 టీఎంసీలు కాగా, ఇప్పుడు 75.14 టీఎంసీలు ఉన్నాయి.
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఆరు గేట్లు ఎత్తి 41,600 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 42,600 క్యూసెక్కుల వరద వస్తున్నది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1,402.92 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. గరిష్ఠ నీటినిల్వ 17.80 టీఎంసీఉలు కాగా, ఇప్పుడు 14.88 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
అడుగులు.