నిజామాబాద్ : రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమకావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంలో రైతుబంధు ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి.
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గం రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు టీఆర్ సురేష్ రెడ్డి సైతం ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఉత్సవాలో రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి లు స్వయంగా ఎడ్లబండి బండిపై ఎక్కి ఉత్సాహంగా వేల్పూర్ వీధుల్లో తిరిగారు. వందలాది ట్రాక్టర్లతో తరలివచ్చిన రైతులు ర్యాలీలో పాల్గొని సీఎం కేసీఆర్కు జేజేలు పలికారు.
సీఎం కేసీఆర్ చిత్రాలతో కూడిన కటౌట్ లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సాగు కష్టాలు తెలిసిన గొప్ప సీఎం కేసీఆర్ అన్నారు. రైతుల కన్నీళ్లను తుడిచేందుకే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. రైతుబంధు తెలంగాణ అన్నదాతలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.