మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో భారీగా చేరికలు

మహబూబ్నగర్ : అభివృద్ధికి కంకణం కట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాములు నాయక్తోపాటు 200 మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మత్రి మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తున్నట్లు చెప్పారు.
ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అందరి సంక్షేమం కోసం టీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేస్తున్నదన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మంత్రి బైక్ నడిపారు. అనంతరం రెడ్క్రాస్ సమావేశ మందిరంలో తెలంగాణ బీసీ మహసభ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రీబాయి 189వ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలాలు వేసి నివాళులు ఆర్పించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, బీసీ మహాసభ నాయకులు మెట్టుకాడి శ్రీనివాస్, ప్రభాకర్, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కొడుకుకు ఉద్యోగం రావాలని తండ్రి ఆత్మహత్య
సనాతన ధర్మాలకు పుట్టినిల్లు భారతదేశం
స్వచ్ఛత ఆచరణలో చూపాలి : మంత్రి హరీశ్ రావు
తాజావార్తలు
- కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
- మేడారం మినీ జాతరకు ప్రత్యేక బస్సులు
- అంగన్వాడీల సేవలు మరింత విస్తరణ
- దేశంలోనే తెలంగాణ పోలీస్ అగ్రగామి
- శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీ.. భారత్ 70/1
- మామిడి విక్రయాలు ఇక్కడే
- దేశవ్యాప్తంగా ‘డిక్కీ’ని విస్తరిస్తాం
- కొత్తపుంతలు తొక్కుతున్న వస్త్రపరిశ్రమ
- మాల్దీవులలో చిల్ అవుతున్న యష్ ఫ్యామిలీ