న్యూఢిల్లీ, జూన్ 9: ఈ నెల చివర్లో విడుదల చేయబోయే ఎస్యూవీ అల్కాజార్కు బుకింగ్స్ ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా ప్రకటించింది. రూ.25,000 డౌన్పేమెంట్తో తమ డీలర్షిప్ల వద్ద లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని కంపెనీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రీమియం ఎస్యూవీ అయిన అల్కాజార్ 6, 7 సీటర్ ఆప్షన్స్లో లభిస్తుంది. అలాగే రెండు ఇంజిన్ ఆప్షన్లు (2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్) అందుబాటులో వున్నాయి.