హైదరాబాద్, సెప్టెంబరు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు టూరిస్టులతో కళకళలాడుతున్నాయి. ఒకవైపు కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉండటం.. మరోవైపు ప్రాజెక్టులు, సరస్సులు జలకళను సంతరించుకోవడంతో టూరిస్టులు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి మొగ్గుచూపుతున్నారు. జలపాతాలను సందర్శిస్తున్నారు. బోటింగ్, వాటర్గేమ్స్కు ప్రాధాన్యమిస్తున్నారు. గత ఆగస్టులో రాష్ట్రంలోని మొత్తం 27 బోటింగ్ కేంద్రాల్లో సందర్శకుల తాకిడీ పెరిగింది. జూన్తో పోల్చుకొంటే జూలై, ఆగస్టు నెలలో హరితహోటళ్లు, బోటింగ్పై వచ్చే ఆదాయం నాలుగు నుంచి ఐదు రెట్లు పెరగడం విశేషం. జూన్లో బోటింగ్ చేసిన పర్యాటకుల సంఖ్య 20 వేలలోపు ఉండగా ఆగస్టులో లక్ష దాటింది. దీంతో పర్యాటకశాఖకు బోటింగ్పై వచ్చే ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. హరితహోటళ్లకు జూన్లో 1.45 కోట్ల ఆదాయం లభించగా, జూలైలో రూ.2.60 కోట్లు, ఆగస్టులో రూ.2.28 కోట్లు లభించింది.
బోటింగ్పైనే ఎక్కువ మంది ఆసక్తి
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నవారిలో ఎక్కువమంది బోటింగ్పై ఆసక్తి చూపిస్తున్నారు. రెండు నెలలుగా హరిత హోటళ్ల ఆదాయం పెరిగింది. జూలైలో రూ.2.60 కోట్లు, ఆగస్టులో రూ.2.28 కోట్లు వచ్చింది. బోటింగ్, వాటర్గేమ్స్కు పెరుగుతున్న ఆదరణ భవిష్యత్తులో తెలంగాణ ఎకో టూరిజం హబ్గా ఆవిష్కృతమవుతుందనడానికి సంకేతం.
-ఉప్పల శ్రీనివాస్గుప్తా, టీఎస్టీడీసీ ఛైర్మన్