మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. దీంతో ప్రాజెక్ట్లోకి భారీగా నీరు వచ్చి చేరుతున్నది. ఎగువ నుంచి జూరాలకు 88,300 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో 12 గేట్లు ఎత్తి 84,739 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.740 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. 8.087 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కాగా, శ్రీశైలం వైపు 81,401 క్యూసెక్కుల నీరు వెళ్తున్నది.
జూరాల నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,27,417 క్యూసెక్కులన నీరు వచ్చి చేరుతున్నది. అధికారులు 62,076 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.10 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 215.807 టీఎంసీలకుగాను 210.5133 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.