శాయంపేట, నవంబర్ 28: అభిమానాన్ని కొందరు పలు రకాలుగా చూపిస్తుంటారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కందిపాటి రమేశ్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై వీరాభిమానంతో నెత్తిన వారి పేర్లు కనిపించేలా కటింగ్ చేయించుకుంటున్నాడు. నాలుగేండ్లుగా ఇలా అభిమానం చాటుకున్నాడు. దళితులకు భూపంపిణీ పథకం కింద మూడెకరాల భూమి వచ్చింది. ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ తన ఇద్దరు ఆడపిల్లలు, భార్యను పోషించుకుంటున్నాడు. అందుకే కేసీఆర్, కేటీఆర్లు అంటే తనకు ఎంతో గౌరవమని రమేశ్ చెప్పాడు. తలకు ఒకవైపు కేటీఆర్ అని, మరోవైపు కేసీఆర్ అని పెద్ద అక్షరాలతో కటింగ్ చేయించుకున్నాడు.