సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒగ్గు పూజారులు స్వామివారి కల్యాణోత్సవాన్ని స్తుతిస్తూ పెద్దపట్నం కార్యక్రమం రాత్రి 12 గంటలకు ప్రారంభించి.. వేకువఝాము వరకు కొనసాగించారు. ఆలయ అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు పట్నం దాటిన అనంతరం భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి వారిని మంత్రి నిరంజన్ రెడ్డి దపంతులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అబ్రహం స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు.