యాదాద్రి, జూన్ 19: యాదగిరిగుట్ట ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ముఖ మండపం, క్యూలైన్లు, ప్రాకార మండపాలు, మాడ వీధులు భక్తులతో సందడిగా మారాయి. దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదం కొనుగోలుకు బారులుతీరారు. వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. స్వామివారి నిత్యోత్సవాలు ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు మొదలయ్యాయి. స్వామివారిని సుప్రభాతంలో మే ల్కొలిపిన అర్చక బృందం తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి, స్వయంభువులకు అభిషేకం చేశారు.
అనంతరం స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన చేపట్టారు. సాయం త్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ చేశా రు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు వైభవంగా సాగాయి. రూ.60.45 లక్షల ఆదాయం వచ్చినట్టు ఈవో ఎన్ గీత తెలిపారు.