హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో జేఎన్టీయూ బీటెక్ పరీక్షల్లో పలు సంస్కరణలు చేశారు. విద్యార్థులు కొన్ని యూనిట్లు చదవకపోయినా, సులభంగా రాసుకొనేలా ప్రశ్నాపత్రం కూర్పులో భారీమార్పులు చేశారు. ప్రశ్నల సంఖ్యను తగ్గించి, చాయిస్ను పెంచారు. చిన్న ప్రశ్నలే ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకొంటున్నారు. గతంలో పరీక్ష సమయం 3 గంటలు ఉండగా, రెండు గంటలకు కుదించారు. జూన్ 14 నుంచి బీటెక్ చివరి సెమిస్టర్ పరీక్షలు జరుగనున్నాయి. గతంలో సెక్షన్ ఏ,బీ ఉండేవి. సెక్షన్ ఏలో 25 మార్కులు, సెక్షన్ బీలో 50 మార్కులకుప్రశ్నలిచ్చేవారు.