నిజామాబాద్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు (Fog) ఆవహించింది. జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో క్రమంగా చలి తీవ్రత పెరుగుతూ వస్తున్నది. తెల్లవారుజాము నుంచి భారీగా మంచు కురుస్తున్నది. దీంతో ఉదయం 8 గంటలు అయినప్పటికీ మంచు తేరుకోవడం లేదు.
పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో రహదారులపై ప్రయాణాలు చేయాలంటే వెనుకాడుతున్నారు. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో దట్టమైన మంచుతో రహదారులు పూర్తిగా కనిపించకుండా పోయాయి.
అయితే పొగమంచు మబ్బుల్లా పరుచుకుని చూపరులను కట్టిపడేస్తున్నది. ఒకింత ఆహ్లాదాన్ని పంచుతున్నది.