హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇందిరమ్మ ఇం డ్ల పథకానికి ప్రభుత్వం హడ్కో నుంచి రూ.3 వేల కోట్ల రుణం సేకరించనున్నది. ఇందుకు రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు అనుమతి ఇస్తూ మంగళవారం ఉత్తర్వు లు జారీ చేసింది. రాష్ట్రంలో 95,235 ఇండ్ల నిర్మాణానికి రుణ సాయం అం దించనున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం తీసుకునే రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించనున్నట్టు పేర్కొన్నది.