కోరుట్ల, జూలై 31: బస్సులో ప్రయాణికురాలు మరిచిపోయిన క్యాష్ బ్యాగ్ను అప్పగించి ఆర్టీసీ ఉద్యోగులు నిజాయితీ చాటారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్కు చెందిన వెంకటమ్మ బస్సులో కోరుట్ల బస్టాండ్కు చేరుకొన్నది.
50 వేల నగదు ఉన్న బ్యాగును సీట్లోనే మరిచిపోయి మంచిర్యాల బస్సు ఎక్కింది. కొద్దిసేపటికి గుర్తుకొచ్చి వెంటనే స్థానిక కంట్రోలర్ కిషన్రావుకు తెలియజేసింది. ఆయన వెంటనే బస్సు కండక్టర్కు సమాచారమిచ్చారు. పట్టణ శివారుకు చేరుకొన్న బస్సును కండక్టర్ సరిత నగదు ఉన్న బ్యాగ్ను బాధితురాలికి అందజేశారు. ఈ సందర్భంగా కండక్టర్ను డిపో మేనేజర్ కృష్ణమోహన్రావు అభినందించారు.