నాగర్కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ హోంగార్డు అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రెండు రోజుల క్రితం అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్లో పర్యటించారు.ఈ సందర్భంగా ఈగల పెంట పోలీస్స్టేషన్కు చెందిన హోంగార్డు(Home Guard) వెంకటేశ్ బందోబస్తు కోసం వచ్చాడు.
బందోబస్తులో అతడు అడవిలో గల్లంతయిన విషయాన్ని గుర్తించిన పోలీసులు(Police) అటవీ సిబ్బందితో (Forest Staff)కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం మన్ననూరు నుంచి ఉమా మహేశ్వరం వెళ్లే కాలిబాటలో హోంగార్డు చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులు కేసు(Policecase) నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.