హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలికి ఈ నెల 8, 9వ తేదీల్లో సెలవు ప్రకటించారు. ఈ నెల 10న బడ్జెట్పై మండలిలో సాధారణ చర్చ చేపట్టనున్నారు. 15వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు. సోమవారం శాసన మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్రావు బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.