స్టేషన్ ఘన్పూర్, జూన్ 2: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో నాగులమ్మ గుడికి మరమ్మతులు చేస్తుండగా సూర్యుడి విగ్రహం, 13వ శతాబ్దం నాటి శిలాశాసనం, మట్టి, డంగు సున్నం లేకుండా గోడ నిర్మించగల ఇటుకలు బయటపడినట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు.
రామకృష్ణ మిషన్ ద్వారా సేవలందిస్తున్న స్వరూపారాణి స్థానికులతో కలిసి గుడి చుట్టూ ఉన్న మట్టిని తొలగించే క్రమంలో ఇవి వెలుగులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. సుమారు ఐదు అడుగుల ఎత్తయిన స్థానిక ఏనే శిలపై తెలుగు లిపిలో రాసిన 10 వరుసల శాసనం ఉన్నది.