నల్లగండ : దేశంలో వ్యవసాయ రంగానికి దిశా దిక్సూచిని చూపిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా రైతుబంధు సంబురాలు నిర్వహించారు. వందలాది ట్రాక్టర్లతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యే అనారోగ్యంతో ఉండడంతో ఆయన తనయుడు ఎన్.సిద్దార్థ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుత్తా పాల్గొని మాట్లాడారు. రైతు రాజుగా బతకాలనే గొప్ప మనసుతో ఆలోచించి రైతులందరికీ రైతుబంధు,రైతు బీమా పథకాన్ని అందించిన గొప్ప ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడింది ఒక్కటీ ఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు.
రాష్ట్రంలో మొట్టమొదటి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పనిచేసి రైతులకు రైతుబంధు అందించడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా వైరస్ వల్ల దేశం, ప్రపంచం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు గురికావద్దనే లక్ష్యంతో రైతులు పండించిన ప్రతి గింజలు కొనుగోలు చేసి రైతులకు ఎంతో సేవ చేసిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనన్నారు.
తెలంగాణ బిజెపి నేతలు, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నోరుకు ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నన్నారో బండి సంజయ్ తెలుసుకుంటే మంచిదని హితువు పలికారు. బిజెపి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి మున్సిపల్ చైర్మన్ భార్గవ్, మాజీ ఎమ్మెల్యే తిప్పని విజయసింహ రెడ్డి, మార్కెట్ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు రామచంద్రనాయక్, తదితరులు పాల్గొన్నారు.