ఖమ్మం : వరి వెద జల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం వైరా నియోజకవర్గం లాలాపురం గ్రామంలో పొలం వద్ద మంత్రి స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి వరి విత్తనాలను వెదజల్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో అనాదిగా వరి నాట్లు వేసే విధానం ఉందని, అయితే కూలీల కొరతతో క్రమంగా వరిలో మూస పద్ధతికి స్వస్తి చెప్పుతూ రైతులు ప్రత్యక్ష సాగుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
ఈ పద్ధతిలో వరి పంట సాగు చేస్తే దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉండటంతో సీఎం కేసీఆర్ ఈ నూతన విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రైతులు ఈ పద్ధతిలో వరిసాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్నారని వివరించారు. రైతులు కూడా ఇదే విధానాన్ని అవలంభించాలని కోరారు.