హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్ బలరాం తెలిపారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన మల్టి స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖర్చుకు వెనుకాడకుం డా ఉద్యోగులు, వారి కుటుంబీకులు, ప్రభావిత ప్రాంతాల ప్రజలకు మల్టి స్పెషాలిటీ వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం ఎం సురేశ్, అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్వీ రాజశేఖరరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్ భాసర్, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కే బాలకోటయ్య, మెడికల్ సూపరింటెండెంట్ పూర్ణచందర్రావు తదితరులు పాల్గొన్నారు.