హైదరాబాద్ ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): శంకర్పల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కేసులో సస్పెన్షన్కు గురైన విద్యార్థులను పరీక్షలకు అనుమతించే అంశాన్ని యూనివర్సిటీ సానుకూలంగా పరిశీలించాలని హైకోర్టు సూచించింది. శంకర్పల్లి పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయలేదని, ఈ లోగా తమను సస్పెండ్ చేయడం అన్యాయమని పేరొంటూ సస్పెన్షన్ గురైన విద్యార్థులు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు.
కమిటీ విచారణను సత్వరమే పూర్తి చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే, శుక్రవారం నుంచి ఇంటర్నల్ పరీక్షలు జరగనున్నాయని, తమను అనుమతించేలా వర్సిటీకి ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో దాడి చేసినప్పుడు అకడ ఉన్నామేగానీ ఆ ఘటనలో పాల్గొనలేదని పిటిషనర్లు వాదించారు. ఈ మేరకు విద్యార్థుల భవిష్యత్తును పరిగణనలో తీసుకొని ఇంటర్నల్ ఎగ్జామ్స్కు అనుమతించే విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని హైకోర్టు సలహా ఇచ్చింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.