హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఇద్దరికి హైకోర్టు సామాజిక సేవకు ఆర్థిక చేయూత ఇవ్వాలని తీర్పు చెప్పింది. సామాజిక సేవకు స్వచ్ఛందంగా చెల్లిస్తామన్న రూ.లక్షతోపాటు, రూ.2 వేలు చొప్పున జరిమానా చెల్లించాలంటూ సికింద్రాబాద్కు చెందిన సుశ్మిత, ఆమె కుమార్తెలను ఆదేశించింది. వివరాల్లోకెళితే.. వివాద భూమిపై ఏ విజయరాజ్ సోనీ పిటిషన్ దాఖలు చేయగా, భూమి యథాతథ స్థితిని కొనసాగించాలని 2014లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవరించాలని సుజయ్ కుమార్, సుశ్మిత వేసిన పిటిషన్ను అనుమతిచ్చింది.
అయితే, దీనిపై సోనీ మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో యథాతథ స్థితి ఉత్తర్వులను జారీ చేసింది. అయినా, సుజయ్, సుశ్మిత ఆ ఆస్తిని మరొకరికి విక్రయించారు. దీంతో సోనీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ పీ నవీన్రావు, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేఏసింది. దీంతో సుశ్మిత, ఇతరులు భేషరతుగా క్షమాపణలు చెప్పి, సామాజిక సేవ నిమిత్తం రూ.లక్ష చెల్లిస్తామని అంగీకరించారు. ఆ మొత్తాన్ని భద్రాచలంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్కు చెల్లించాలని, డ్రాఫ్ట్ తీసి దాని ప్రతిని హైకోర్టుకు నివేదించాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని, లేకపోతే 15 రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నది.