హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పలు కారణాల వల్ల వేరే రాష్ర్టాల్లో రెండేండ్లపాటు చదువుకున్న తెలంగాణ శాశ్వత విద్యార్థులకు స్థానిక కోటా కింద మెడికల్ సీట్లు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును తమకు కూడా వర్తింపజేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. గత నెల 29న ఇచ్చిన తీర్పును తమకు కూడా వర్తింపజేయాలన్న విద్యార్థుల పిటిషన్లను ఆమోదించలేమని స్పష్టం చేసింది.
విద్యార్థులు తమ హక్కులను కోరే విషయంలో జాప్యం చేశారని పేర్కొంది. ఇప్పటివరకు నిద్రపోయి తమకు కూడా ఉత్తర్వులు జారీ చేయాలని కోరడం సబబుకాదని స్పష్టంచేసింది. స్థానిక కోటా సీట్ల కేటాయింపును కాళోజీ యూనివర్సిటీ ఆగస్టు 2న తిరసరించిందని, ఆగస్టు 31న ఇతరులు పిటిషన్లు దాఖలు చేశారని గుర్తు చేసింది. తమ హకులపై నిద్రపోయి తీరుబడిగా కోర్టులో పిటిషన్లు వేస్తే రాజ్యాంగంలోని విచక్షణాధికారాలను వినియోగించి ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది.