Diwakar Travels | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించి నడుపుతున్న దివాకర్ ట్రావెల్స్పై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కేసు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా, హోం శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు రవాణాశాఖ కమిషనర్కు, డీజీపీకి, సీబీఐకి, దివాకర్ ట్రావెల్స్ యజమాని, ఏపీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డికి మంగళవారం నోటీసులు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏపీ, కర్ణాటకలో కేసులున్నాయని, తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేయడం లేదని తాడిపత్రి ఎమ్మెల్యే కే పెద్దారెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఈ నోటీసులను జారీచేసింది.