Barrelakka | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి కర్నె శిరీష అలియాస్ బర్రెలకకు రక్షణ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు గన్మన్ తో రక్షణ కల్పించాలని శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. బర్రెలక నిర్వహించే పాదయాత్రలు, సభలకు పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలని సూచించింది. తన ఎన్నికల ప్రచారానికి పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతూ బర్రెలక దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సీవీ భాసర్రెడ్డి ధర్మాసనం శుక్రవారం విచారించింది.
పిటిషనర్కు గెలుపు అవకాశాలున్నాయని, పోలీసుల రక్షణ లేకపోవడం వల్ల గుర్తుతెలియని వ్యక్తులు ప్రచారానికి అడ్డంకులు కల్పిస్తున్నారని సీనియర్ న్యాయవాది సీ రఘు తెలిపారు. ఇటీవల ఆమె సోదరుడిపై కొందరు దాడి చేసి బెదిరించారని వెల్లడించారు. ఈ వ్యవహారంపై పోలీసు కేసు నమోదైందని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు, ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు పోలీసులు రక్షణ కల్పించాలని ఆదేశించింది.