హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం ఇవ్వాలని ఆ సంస్థ యాజమాన్యం చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో ఆదేశించిన మేరకు అక్టోబర్ చివరి నాటికే ఈ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గత నాలుగేండ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికలు జరగకపోవడంతో కార్మికులు ఆయోమయ స్థితిలో ఉన్నారని సింగరేణి కార్మిక సంఘాల తరఫు న్యాయవాది విద్యాసాగర్ వాదించారు. వేర్వేరు కారణాలతో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరడాన్ని తప్పుపట్టారు.