హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని హాస్టళ్లలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై 3 వారాల్లోగా నివేదిక అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో వసతులు కల్పించడం లేదని, వార్డెన్లు అందుబాటులో లేకపోవడంతోపాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాత్రూమ్లు, టాయిలెట్లు లేవంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు సీజే అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.