హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని క్యాబ్లలో మీటర్ల ఏర్పాటుకు చేపట్టిన చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. మీటర్లు ఏర్పాటు చేయకపోవడంతో క్యాబ్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారని, ఇది నిబంధనలకు వ్యతిరేకమని పేరొంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మోటరు వాహన చట్టంలోని 74(1)(8) నిబంధనల ప్రకారం క్యాబ్లకు మీటర్లు బిగించేలా ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది దీపక్ మిశ్రా కోరారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు సూచించిన ధర్మాసనం.. విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.