హైదరాబాద్, ఫిబ్రవరి15 (నమస్తే తెలంగాణ): గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో 2000 – 2003 మధ్యకాలంలో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులైన బోధనా సిబ్బంది సర్వీసులను 2008లో క్రమబద్ధీకరించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. వారు సర్వీసులో చేరినప్పటి నుంచే క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని కూడా అప్పటి నుంచే అమలు చేయాలని స్పష్టం చేసింది. గురుకులాల బోధనా సిబ్బంది పీ రుషికేష్కుమార్ మరో 120 మంది దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ తీర్పు చెప్పారు. ‘కాంట్రాక్టు సర్వీస్లో చేరినప్పటినుంచే వారి సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలి. 2008లో సర్వీస్ను క్రమబద్ధీకరణ చేయడం సరికాదు.
అదేవిధంగా 2018 డిసెంబర్ 18న జారీచేసిన సర్యులర్ ప్రకారం కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ను అమలు చేయడం చట్ట వ్యతిరేకం. పెన్షన్ రూల్ 13 ప్రకారం పే సేలు సర్వీసును లెకించేందుకు ఆధారం కాదు. రెగ్యులర్ చేసిన తేదీ నుంచి కాకుండా నియామక తేదీ నుంచే సర్వీస్ నిబంధనలు వర్తింపజేయాలి. పిటిషనర్లు 2000 2003లో కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరారు. వీరిని ప్రభుత్వం 2008లో రెగ్యులర్ చేస్తూ జీవో 91 జారీచేసింది. విధుల్లో చేరిన తేదీని పరిగణనలోకి తీసుకోకుండా 2018లో కంట్రిబ్యూటరీ పెన్షన్ సీంను అమలు చేయడం చెల్లదు. 2004లో విధుల్లో చేరిన రెగ్యులర్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ను వర్తింపజేస్తున్నప్పుడు పిటిషనర్లకు మాత్రం కొత్త స్కీం వర్తింపు చట్ట వ్యతిరేకమే’ అని తీర్పులో పేరొన్నారు.