కొండాపూర్, సెప్టెంబర్ 10 : వ్యాపారులం తా కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని ఎకనామికల్గా ఎదిగేందుకు కృషి చేయాలని హైకోర్టు జడ్జి ఈవీ వేణుగోపాల్ అన్నారు. చంద్రయాన్3 విజయవంతంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, త్వరలోనే మనందరం ఎకనామిక్ లీడర్లుగా నిలువబోనున్నట్టు చెప్పారు. ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఎంఎన్ వ్యాపారవేత్తల యాప్ను ఆయన ప్రముఖ సినీనటుడు సోనూసూద్తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వేణుగోపాల్ మా ట్లాడుతూ.. 2004లో నలుగురు విద్యార్థులు రూపొందించిన ఫేస్బుక్ ప్రస్తుతం 3 బిలియన్ యూజర్స్తో దూసుకుపోతున్నదని తెలిపారు. వ్యాపారవేత్తలు కూడా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ తాము ఎదుగుతూ దేశ ఎకానమీ పెంచేందుకు కృషి చేయాలలని చెప్పారు. కార్యక్రమంలో ఎంఎంఎన్ ఫౌండర్ మడిపడిగె రాజు, జేడీ లక్ష్మీనారాయణ, నిర్మాత రామసత్యనారాయణ, పలు సంస్థల సీఈవోలు పాల్గొన్నారు.