హైదరాబాద్, నవంబర్16, (నమస్తే తెలంగాణ): గత శాసనసభ ఎన్నికల సమయంలో మహబూబ్నగర్ నుంచి గెలుపొందిన మంత్రి శ్రీనివాస్గౌడ్పై ఎలక్షన్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నదని, అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆయన నామిషన్ను తిరసరించాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. మహబూబ్నగర్కు చెందిన ఓటరు చలువగాలి రాఘవేంద్రరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈసీ తరఫు న్యాయవాది లేకపోవడంతో తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అఫిడవిట్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదురొంటున్న అధికారులంతా ఇంకా అకడే బాధ్యతలు నిర్వహించడాన్ని తప్పుపడుతూ చలువగాలి రాఘవేంద్రరాజు మరో పిటిషన్ దాఖలుచేశారు. ఆ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ కూడా శుక్రవారానికి వాయిదా పడింది.