హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ పోస్టుల ని యామకానికి సంబంధించిన జీవో 25లోని నిబంధనలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొన్నది. ఎస్జీటీ పోస్టుల అర్హతకు జీవో 25లోని నిబంధన 4(2)(2)పై పూర్తి వివరాలు అందజేయాలని తెలిపింది. ఈలోగా నియామకాలు చేపడితే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్ప ష్టంచేసింది.
తదుపరి విచారణను 4 వా రాలకు వాయిదా వేస్తూ జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ శ్రవణ్కుమార్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. జీవో 25లోని నిబంధనను సవాల్ చేస్తూ క్రాంతికుమార్సహా 25 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఎస్జీటీ పోస్టులకు 2007కు ముందు ఇంటర్లో 45 శా తం, ఆ తర్వాత 50 శాతం మారులుండాలన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.