హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బుధవారం హైకోర్టులో న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, టీఆర్ఎస్ లీగల్సెల్ నాయకుడు చంగల్వ కల్యాణ్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు హైకోర్టు ఆరో గేటు నుంచి నాలుగో గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు లలితారెడ్డి, అజయ్కుమార్, వేణుగోపాల్రావు, రాజేశ్వర్రావు, గొరిగే మల్లేశ్, చంద్రశేఖర్రావు, నల్లమోతు రాము, సదానందం, శ్రీనునాయక్, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ముంతాజ్ పాషా తదితరులు పాల్గొన్నారు.