ములుగు : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు మాడవి హిడ్మా అలియాస్ ముక్క
బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఎదుట లొంగిపోయాడు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన హిడ్మాను సీఆర్పీఎఫ్ (కలివేరు) అధికారులు కమాండెంట్ ప్రద్యుమ్న్ కుమార్ సింగ్, బిష్ణు చరణ్ మునకియ ద్వారా ములుగు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయాడు.
పార్టీ నుంచి వేధింపులు ఎదురవుతున్న నేపథ్యంలో హిడ్మా మావోయిస్టు పార్టీని వీడాలని నిర్ణయించుకొని స్వచ్ఛందంగా లొంగిపోయాడని ఎస్పీ తెలిపారు.