సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని పొగమంచు చుట్టేసింది. ఉదయం 8 గంటలు గంటలు దాటినా మంచు ప్రభావం తగ్గలేదు. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ఇక్కట్లకు గురయ్యారు.
జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోనూ పొంగమంచు కమ్మేసింది. మబ్బుల్లా కమ్మేసిన పొగమంచు చూపరులను కనువిందు చేసింది. మంచు తెరల అందాలను కొందరు ప్రేమికులు తమ సెల్ఫోన్ కెమెరాల్లో బంధించారు. కరీంనగర్-కామారెడ్డి, హైదరాబాద్-సిరిసిల్ల రహదారుల పొడవున ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది.