యాదాద్రి, సెప్టెంబర్ 11 : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. స్వయంభువులను దర్శించుకొనేందుకు భక్తులు క్యూ కట్టారు. కొండపై క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల కిటకిటలాడాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సుమారు 23,246 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.38,22,868 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. కాగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొన్నారు.