హైదరాబాద్ : భారీ వర్షాలతో తెలంగాణ జలశోభను సంతరించుకుంది. రాష్ట్రాన్ని గులాబ్ తుఫాను ముంచేస్తోంది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రం తడిసి ముద్దయింది. వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. రోడ్లు తెగిపోయాయి. పంటలు నీట మునిగాయి. ప్రాజెక్ట్లు నిండుకుల్లా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువు నీటిని విడుద చేస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో జోరుగా ప్రవహిస్తున్న దుందుభి వాగు..
జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో వర్షాలకు సికింద్రాపూర్ – కేశ్ పల్లి మధ్య తెగిపోయిన రోడ్డు
సంగారెడ్డి జిల్లాలోని జోరుగా ప్రవహిస్తున్న ఆరెంజ్ వాగు
నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఉధృతి..
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గొనుగొప్పుల గ్రామంలో వాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ వాహనం..
సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ నీటిలో మునిగిపోవడంతో ట్రాక్టర్పై బయటికి వస్తున్న కలెక్టర్ అనురాగ్ జయంతి
సింగూరు ప్రాజెక్ట్ పరవళ్లు
నిజామాబాద్ జిల్లాలో నీట మునిగిన సబ్ స్టేషన్
ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ను పరిశీలిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామ శివారు మీదుగా ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది
నిజామాబాద్ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామ శివారులో నీట మునిగిన పల్లె ప్రకృతి వనం