Rain Update | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు గురువారం తెలిపింది.
హైదరాబాద్, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, నాగర్కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీచేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. బుధవారం రాత్రి హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.