హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాలకు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కర్ణాటకలో వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీరు జూరాలకు చేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.43 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 23 గేట్ల ద్వారా 1,46,147 క్యూసెక్కుల నీటిని దిగువకు వెళ్తున్నది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.48 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.