Srisailam | శ్రీశైలం : శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 80,646 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు అధికారులు విడుదల చేస్తున్నారు. జలాశయానికి బుధవారం జూరాల ప్రాజెక్టు విద్యుదోత్పత్తి ద్వారా 28,658 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 94,878 క్కూసెక్కులు, సుంకేసుల నుంచి 57,515 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి చేరుతున్నది. సాయంత్రానికి 1,87,915 క్యూసెక్కుల వరద రిజర్వాయర్ చేరుతున్నట్లు డ్యామ్ అధికారులు పేర్కొన్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు. ప్రస్తుతం 882.40 అడుగుల మేర నీరున్నది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.1205 టీఎంసీల నిల్వ ఉన్నది. కుడి, ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. వీటి ద్వారా మరో 67,299 క్యూసెక్కులు సాగర్కు వెళ్లున్నది.