జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భా గంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్కు వరద భారీ గా వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఎగువన ఉన్న మహారాష్ట్రలో ప్రాణహిత నది నుంచి వరద ఉదృతి భారీగా కొనసాగుతున్నది.
ప్రాజెక్ట్ పూర్తి నిల్వ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.8 టీఎంసీల నీరు ఉంది. శనివారం ఇన్ ఫ్లో 1,15,860 క్యూసెక్కులు ఉండగా.. ఆదివారం 4,93,540 క్యూసెక్కులకు పెరిగింది. అవుట్ ఫ్లో 5,54,660 క్యూసెక్కులుగా ఉంది. బరాజ్కి 85 గేట్లు ఉండగా ప్రస్తుతం 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.