న్యూఢిల్లీ : రామసేతును జాతివారసత్వ సంపదా ప్రకటించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఫిబ్రవరి రెండోవారంలో విచారణ జరుపనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనంలో విచారణ జరుగుతున్నందున ఈ అంశాన్ని అత్యవసర విచారణకు తీసుకోలేమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం గురువారం పేర్కొంది. ఈ వ్యవహారంపై సొలిసిటర్ జనరల్ సమాధానమిచ్చారని, క్యాబినెట్ సెక్రటరీకి సమన్లు జారీ చేయాలని బీజేపీ నేత స్వామి కోర్టును కోరారు. డిసెంబర్ 12లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్జీ తుషార్ మెహతా కోరారని, ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు. సుబ్రహ్మణ్యస్వామి వాదనలపై మెహతా స్పందిస్తూ.. డిమాండ్పై చర్చ జరుగుతుందని, ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.
ఫిబ్రవరి మొదటి వారంలో విచారణ చేపట్టాలని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామసేతు ఉనికిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. డిమాండ్ను పరిశీలించేందుకు 2017లో సంబంధిత కేంద్ర మంత్రి సమావేశాన్ని పిలిచారని, అయితే ఆ తర్వాత ఏం జరుగలేదని పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వ హయాంలో వివాదాస్పద సేతుసముద్రం జలమార్గం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుబ్రహ్మణ్యస్వామి రామసేతను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని గతంలో డిమాండ్ చేశారు. 2007లో రామసేతు ప్రాజెక్టు పనుల విషయం సుప్రీంకోర్టుకు చేరింది. అయితే, రామసేతుకు నష్టం జరుగకుండా షిప్పింగ్ మార్గానికి ఇబ్బంది లేకుండా మరో మార్గాన్ని గుర్తించాలని కేంద్రం కోరింది. తాజాగా కేసులో కోర్టు తాజాగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.