జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్యవంతమైన రాష్ట్రం సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం రేగొండ మండలంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎవరైనా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారు స్థానిక సర్పంచ్, ప్రజా ప్రతినిధుల ద్వారా లేదా నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించి సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మి, జడ్పీటీసీ సాయిని విజయ, వైస్ ఎంపీపీ విద్యాసాగర్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఉమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గోదావరిలో మునిగిన పురాతన శివాలయం
బైక్ను ఢీ కొట్టిన డీసీఎం..ఒకరి మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు