గూడూరు, ఫిబ్రవరి8: ‘మంచం పట్టిన సాంబయ్యపల్లి’ శీర్షికన గురువారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి వైద్యులు స్పందించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సాంబయ్యపల్లిలో వైద్యాధికారులు వైద్య శిబిరం నిర్వహించారు. అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేసి మం దులు అందజేశారు.
అయోధ్యపురం పీ హెచ్సీ వైద్యురాలు యమున సిబ్బంది తో కలిసి 62 మందిని పరీక్షించారు. వీరి లో 26 మందికి రక్త నమూనాలు సేకరించి టీహబ్ ల్యాబ్కు పంపించారు. ముగ్గురిని జ్వరపీడితులుగా గుర్తించారు. మధ్యాహ్నం డీఎంఅండ్హెచ్వో డాక్టర్ అం బరీష హెల్త్ క్యాంపును సందర్శించి కొంతమందిని పరీక్షించి పలు సూ చనలు చేశారు. అనంత రం ఆశ వర్కర్లు, సిబ్బందితో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరిగి పరిసరాల పరిశుభ్రత, తాగునీటి గురించి వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ దే వేందర్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివా స్, హెచ్ఈవో రాజు, సూపర్వైజర్ గణే శ్, హేమలత తదితరులు పాల్గొన్నారు.