హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆకుకూరలంటే చాలామందికి బోర్. ఆ గడ్డికూరలు ఎవరు తింటారంటూ మూతివిరిచేవారూ లేకపోలేదు. కానీ, ఆకుకూరలు ఆరోగ్యానికి దివ్యమైన ఔషధం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో ఆకుకూరలది ప్రత్యేక స్థానం. ప్రతిరోజూ మనం తీసుకొనే ఆహారంలో దాదాపు 20 శాతమైనా ఆకుకూరలు ఉండాలని సూచిస్తున్నది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్). కానీ ప్రజల్లో ఆకుకూరల వినియోగంపై సరైన అవగాహన లేకపోవడంతో ఎన్నో విలువైన ప్రయోజనాలను కోల్పోతున్నారని ఎన్ఐఎన్ నిపుణులు చెప్తున్నారు.