ఆదిలాబాద్ రిమ్స్లో పండంటి బిడ్డతో కనిపిస్తున్న ఈ బాలింత పేరు నందిని. మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా మాండ్వికి చెందిన ఈమెను మూడ్రోజుల కిందట ప్రసవ వేదనతో రిమ్స్కు తీసుకొచ్చారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. మరుసటి రోజు ఆపరేషన్ చేసి పురుడు పోశారు. ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి కారణంగా మహారాష్ట్రలో వైద్య సేవలు సరిగా అందని పరిస్థితుల్లో వచ్చిన తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసవం చేసిన వైద్యులు సేవలు ఎప్పటికీ మరవలేమని నందినితోపాటు ఆమె కుటుంబసభ్యులు అంటున్నారు.