కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొమరారంలో విషాదం చోటుచేసుకుంది. కొమరారం పరిధిలోని కాచనపల్లి (Kachanapalli) పోలీస్ స్టేషన్లో తుపాకీ మిస్ఫైర్ కావడంతో హెడ్కానిస్టేబుల్ (Head constable) మృతిచెందారు. వరంగల్ జిల్లా గవిచర్లకు చెందిన సంతోష్.. కాచనపల్లి పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో స్టేషన్లో ఆయుధాలు పరిశీలిస్తుండగా ఓ తుపాకీ పేలింది.
దీంతో సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మూడు రోజుల క్రితమే సంతోష్ తల్లిదండ్రులు పెండ్లి సంబంధం చూశారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆ కుటుంబలో తీవ్ర విషాదం అలముకున్నది.